నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా. నా బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని … నా కథల వెనుక అసలు కథ !ని చదవడం కొనసాగించండి
‘సద్గతి’ – మధురాంతకం నరేంద్ర గారు
రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి … ‘సద్గతి’ – మధురాంతకం నరేంద్ర గారుని చదవడం కొనసాగించండి
‘ట్రిగ్గర్’
https://player.captivate.fm/episode/684c5509-4f7f-45b1-b1ed-95d3a4d39066 ట్రిగ్గర్ అశోకరాజు సోఫాలో కూచుని కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసాడు. ‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు. జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు ప్రేక్షకులకు అందచేస్తున్నారు. దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ … ‘ట్రిగ్గర్’ని చదవడం కొనసాగించండి
‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ.
ఛాయా మోహన్ గారు రాసిన కథ ఇది. స్వింగ్ ----------------------------- వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా ఉంది. చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది. ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు. … ‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ.ని చదవడం కొనసాగించండి
‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచి
'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'. శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో … ‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచిని చదవడం కొనసాగించండి
‘రామేశ్వరం కాకులు’
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ' రామేశ్వరం కాకులు' పుస్తకం లోనిది. పుస్తకం కొనాలంటే - https://amzn.to/3rDN1YM రామేశ్వరం కాకులు : వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు … ‘రామేశ్వరం కాకులు’ని చదవడం కొనసాగించండి
‘తెరిచున్న కిటికీ’
‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’ (https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window) “అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా. వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్. నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప … ‘తెరిచున్న కిటికీ’ని చదవడం కొనసాగించండి
‘ఒంటరి – జోడి’
కథా మూలం అమెరికన్ రచయిత షేర్ వుడ్ ఆండర్సన్ రాసిన - ‘బ్రదర్స్’ (https://americanliterature.com/author/sherwood-anderson/short-story/brothers) రచయిత గురించి - మొదటి రెండవ ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో రచనలు చేసిన షేర్ వుడ్ ఆండర్సన్, విలియం ఫాక్నర్, హెమింగ్వే లాటి రచయితలకి అభిమాన కథా రచయిత. మొదటి పారిశ్రామిక విప్లవం వల్ల పట్టణాల, గ్రామాలలో నివసించే ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందుల గురించి మానసికంగా విశ్లేషిస్తూ అనేక కథలు రాసారు. ఒంటరి జోడి (Brothers - Sherwood … ‘ఒంటరి – జోడి’ని చదవడం కొనసాగించండి
వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)
' వర్షంలో పిల్లి' , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన 'Cat in the Rain'. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు. ‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం - పతంజలి శాస్త్రి (‘Cat in the Rain’: ఆంగ్ల మూలం - ఎర్నెస్ట్ హెమింగ్వే) ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. … వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)ని చదవడం కొనసాగించండి
పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !
అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో - విభో - కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ నండూరి రాజగోపాల్ గారు పతంజలి శాస్త్రి గారిపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక కై … పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !ని చదవడం కొనసాగించండి
పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్ర
అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో - విభో - కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కథారచనపై హర్షణీయం సమీక్ష. కథలో పాఠకుడి పాత్ర “ నేను రాసేటప్పుడు అంతా … పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్రని చదవడం కొనసాగించండి
కూపే
‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’) అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం. సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. … కూపేని చదవడం కొనసాగించండి
ఆశ – ఆశంక
ఆశ - ఆశంక : వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. మొహంలోకి పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది. ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను. ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి ఇంటికి … ఆశ – ఆశంకని చదవడం కొనసాగించండి
‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!
నల్లజర్ల రోడ్డు 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు. పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. - http://bit.ly/tilaknavodaya ' “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. … ‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!ని చదవడం కొనసాగించండి
అనుకున్నదొకటీ: హర్ష
"అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా" అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య "ఏంది చిన్నాయన మందల" అంటూ పలకరించా. "నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ … అనుకున్నదొకటీ: హర్షని చదవడం కొనసాగించండి
ఖదీర్ బాబు గారి ‘గేట్’!
'గేట్' ఖదీర్ బాబు గారి రచన. ' గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ' దర్గామిట్ట కథలు ' , ' న్యూ బాంబే టైలర్స్ ' , ' పోలేరమ్మ బండ … ఖదీర్ బాబు గారి ‘గేట్’!ని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : నవల పూర్తి యాభై భాగాలు !
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. స్పాటిఫై యాప్ ద్వారా వినడానికి - https://open.spotify.com/show/0E9aKYhZO3jEOwdinpoG8D ఆపిల్ యాప్ ద్వారా వినడానికి - … ‘వనవాసి’ : నవల పూర్తి యాభై భాగాలు !ని చదవడం కొనసాగించండి
‘వనవాసి’ : 17-30 భాగాలు 
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక పదిహేడో భాగం నించి ముప్ఫయవ భాగం ఇపుడు పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.
‘వనవాసి’ : 16 వ భాగం
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక పదహారో భాగం ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.
వనవాసి ధారావాహికలో భాగంగా పర్యావరణంపై ప్రసంగాలు.
అరణ్యాలు ( శ్రీ డీ వీ గిరీష్ ) , చిత్తడినేలలు ( శ్రీ. రితేష్ కుమార్ ) , మడ అడవులు ( కుమారి అజంతా డే ) , సముద్రాలు ( శ్రీ వివేకానందన్ ), - ఆంగ్లంలో
హిమాలయ పర్యావరణం – మానసీ అషేర్ గారు ఆంగ్లంలో
వనవాసి ధారావాహికలో భాగంగా , ఈ ఎపిసోడ్ లో హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత , మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మానసి అషేర్ గారు (Ms.Manshi Asher) మనతో సంభాషిస్తారు. ఇంకొన్ని వివరాల కోసం : https://www.himdhara.org/ https://www.indiawaterportal.org/articles/dams-and-distress-himalayas
తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్టు – లెప్చా ఆదివాసీలు (ఆంగ్లంలో)
వనవాసి ధారావాహిక లో భాగంగా ఈ ఎపిసోడ్లో , సిక్కింలో అనాదిగా నివసిస్తున్న ‘లేప్చా’ తెగ కు చెందిన ప్రజల కు తీస్తా నదితో వున్న సంబంధం , తీస్తా హైడ్రో డాం నిర్మాణం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చా గారు (Ms.Mayalmit Lepche) మనతో సంభాషిస్తారు.
‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్ష
వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికి 15 భాగాలు ప్రసారం చెయ్యడం జరిగింది. ఇంకొక 45 భాగాలు పూర్తి చెయ్యవలసి వుంది. దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ ' వనవాసి' నవల, మానవుడికి ప్రకృతికి మధ్య , మారుతున్న సంబంధం గురించి, ఒక రచయిత స్పందన. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా , పర్యావరణ సంరక్షణ కై కృషి చేస్తున్న కార్యకర్తలు , సామాజిక సంస్థల ప్రతినిధులు, వివిధ పర్యావరణ వ్యవస్థలపై పని చేస్తున్న నిపుణులు, ఇలా అనేకమందితో … ‘వనవాసి’ శబ్దరూపకం – సమీక్షని చదవడం కొనసాగించండి
నదీ జలాల పరిరక్షణ – మౌలిక్ సిసోదియా గారి పరిచయం
' వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది. శ్రీ. మౌలిక్ సిసోదియా గారు రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి , పర్యావరణంలో వస్తున్న మార్పులు , నీటి … నదీ జలాల పరిరక్షణ – మౌలిక్ సిసోదియా గారి పరిచయంని చదవడం కొనసాగించండి
పర్యావరణ వేత్త , కవి శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ : ‘వనవాసి’ నవలపై
హర్షణీయం 'వనవాసి' ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది. ఈ ఎపిసోడ్ లో అతిధి, ముప్ఫయి ఏళ్ల పైబడి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలకు పర్యావరణ విషయాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ. జి.సత్య శ్రీనివాస్ గారు. వనవాసి నవలను సామాజిక, చారిత్రక, సాహిత్య, పర్యావరణ కోణాల్లో విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. పర్యావరణ కవిత్వం … పర్యావరణ వేత్త , కవి శ్రీ సత్య శ్రీనివాస్ గారి విశ్లేషణ : ‘వనవాసి’ నవలపైని చదవడం కొనసాగించండి
విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ
హర్షణీయం 'వనవాసి' ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది. ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ … విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణని చదవడం కొనసాగించండి